హవేళీఘనపూర్/ చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 23 : సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు పెద్దన్నగా బతుకమ్మ చీరలను సారెగా అందజే స్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హవేళీఘనపూర్ మండలకేం ద్రంతోపాటు సర్దన గ్రామంలో మహిళలకు పెన్షన్ స్మార్కార్డు లు, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ అన్ని మతాల పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నా రు. సీఎం కేసీఆర్ కృషితో జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుతో పాటు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం నిర్మించామన్నారు. పెం డింగ్లో ఉన్న రైల్వేలైన్ నిర్మాణం పూర్తి చేసి మెదక్కు రైలు కూత వినిపించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్పర్సన్ లావణ్యారెడ్డి, ఎంపీపీ వైస్ చైర్మన్ రాధాకిషన్యాదవ్, జడ్పీటీసీ సుజాత, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు సవిత, రాజేందర్రెడ్డి, మంద శ్రీహరి, మెదక్ పీఎసీఎస్ డైరెక్టర్ సాయిలు, ఎంపీటీసీ లు మంగ్యా, మాజీ సర్పంచ్ మేకల సాయిలు, నేతలు సతీశ్ రావు, నరేందర్రెడ్డి, రాంచంద్రారెడ్డి, రాజేశ్వరావు ఉన్నారు.
చిన్నశంకరంపేటలోని రైతువేదికలో వివిధ గ్రామాలకు చెం దిన లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పట్లోరి మాధవి, రైతుబంధు మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, తహసీల్దార్ రాజేశ్వర్రావు, ఎంపీడీవో గణేశ్రెడ్డి, సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతీక
శివ్వంపేట, సెప్టెంబర్ 23 : తెలంగాణ సంస్కృతికి బతుక మ్మ పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని దంతాన్పల్లి, కొంతాన్పల్లి, గుండ్లపల్లి, దొంతి, శభాష్పల్లి గ్రామాల్లో బతుకమ్మ చీరలను అందజేశారు. దొంతి పాఠశాలలో వంటగది నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేశ్గుప్తా, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూ ర్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఇన్చార్జి ఎంపీడీ వో తిరుపతిరెడ్డి, సర్పంచ్లు దుర్గేశ్, శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్యాదవ్, ఫణిశశాంక్శర్మ, పార్వతి, ఎంపీటీసీలు ఇందిర, లక్ష్మి, నేతలు లాయక్, సత్యనారాయణ, నాగేశ్వర్రావు, వేణుగోపాల్రెడ్డి, కృష్ణారావు, శ్రీనివాస్గౌడ్, వీరేశం, షేక్అలీ, కైఫ్ పాల్గొన్నారు.
మహిళా అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పెద్దపీట
మనోహరాబాద్/తూప్రాన్, సెప్టెంబర్ 23 : మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. కాళ్లకల్, గౌతోజిగూడెం గ్రామాల్లో బతుక మ్మ చీరలను అందజేశారు. మనోహరాబాద్, కొనాయిపల్లి(పీటీ), ముప్పిరెడ్డిపల్లి గ్రామా ల్లో మహిళలకు బతుకమ్మ చీరలను సర్పంచ్లు మహిపాల్రెడ్డి, ప్రభావతీనర్సింహులు, ప్రభావతి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్ ముదిరాజ్, ఎంపీపీ నవనీత, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, ఎంపీటీసీ లావణ్య, సర్పంచ్ మల్లేశ్ముదిరాజ్, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, ఏపీఎం పెంటాగౌడ్, ఉప సర్పంచ్లు కరుణాకర్రెడ్డి, రాజూయాదవ్ ఉన్నారు.
తూప్రాన్ పట్టణంలో గ్రంథాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్, కమిషనర్ మోహన్, కౌన్సిలర్ వెంకటేశ్, నేతలు సత్యలింగం, రాజు, మల్లేశ్, లక్ష్మణ్, సత్తార్, రఘుపతి, ఆంజనేయులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
నేడు బతుకమ్మ చీరల పంపిణీ
చిలిపిచెడ్/ వెల్దుర్తి, సెప్టెంబర్ 23 : తెలంగాణ ఆడపడుచుల గౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మకు ప్రభుత్వం అందించే చిరుకానుక బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వెల్దుర్తి, చిలిపిచెడ్ మండలాకు బతుకమ్మ చీరలు వచ్చినట్లు ఎంపీడీవోలు జగదీశ్వర్, శశిప్రభ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఆడపచులకు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే మదన్రెడ్డి అందజేస్తారు. చిలిపిచెడ్ మం డలంలో ఉదయం 10 గంటలకు చిట్కుల్, చండూర్, గం గారం, జగ్గంపేట, చిలిపిచెడ్ గ్రామాల్లో పంపిణీ చేయనున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్రెడ్డి తెలిపారు.
పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలు
కొల్చారం/ చేగుంట, సెప్టెంబర్ 23 : మండలవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం బతుకమ్మ సంబురాలు ని ర్వహించారు. పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్ట్టు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాటలు పాడుతూ, ఆడుతూ పాల్గొన్నారు. ఎనగండ్లలో జరిగిన వేడుకల్లో ఎంపీపీ మం జుల, హెచ్ఎంలు వెంకటరాజు, కరుణాకర్, టీచర్లు అరుణ, రాగిని, వాణి, షహనాబేగం, ఆసియాబేగం, అంగన్వాడీ టీచర్లు అనసూయ, ఏసుమణి ఉన్నారు. చేగుంట మండలం వల్భాపూర్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హెచ్ఎం పరమేశ్వర్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.