మహబూబాబాద్, సెప్టెంబర్ 26 : బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను చాటుతున్నదని కలెక్టర్ కే శశాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళా అధికారులు, సిబ్బంది తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆటాపాటలతో సందడి చేశారు.
మహిళలు, చిన్నారులు సంతోషంగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్ కోరారు. మహిళలతో కలిసి కలెక్టర్ శశాంక బతుకమ్మ ఆడి ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాషాఅభినవ్, ఎం డేవిడ్, డీఎఫ్వో రవికిరణ్, జిల్లా సంక్షేమాధికారి నర్మద, డీఆర్డీవో సన్యాసయ్య, జడ్పీ సీఈవో రమాదేవి, సీపీవో సుబ్బారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రూనాయక్, డీఈవో అబ్దుల్హై, జిల్లా ఉద్యాన అధికారి సూర్యనారాయణ, ఎక్సైజ్ అధికారి కిరణ్నాయక్, తహసీల్దార్ నాగభవాని, సీడీపీవోలు, పాల్గొన్నారు.