లండన్: ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC)తో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చాంపియన్షిప్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత్, కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన చేసి
తుది పోరుకు చేరుకున్నాయి. టెస్టు క్రికెట్లో పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు ఫైనల్ ఫైట్ కోసం
ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టోర్నీలో టీమ్ఇండియా ఫేవరెట్గా బరిలో దిగనుంది. ఐసీసీ టెస్టు బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ టాప్-10లో ఇరుజట్లకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు.
విలియమ్సన్-919 రేటింగ్స్
బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో విలియమ్సన్ టాప్లో కొనసాగుతున్నాడు. 83 టెస్టుల్లోనే కేన్ 7000కు పైగా పరుగులు సాధించాడు. అందులో 4 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 24 శతకాలు, 32 అర్ధశతకాలు నమోదు చేశాడు.
విరాట్ కోహ్లీ-814 రేటింగ్స్
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంకింగ్స్లో ఐదో స్థానంలో నిలిచాడు. కోహ్లీ 91 టెస్టుల్లో 7,490 పరుగులు చేశాడు. విరాట్ 7 డబుల్ సెంచరీలు బాదాడు. తన ఖాతాలో 27 సెంచరీలు, 25 హాఫ్సెంచరీలు ఉన్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకు కోహ్లీ ఒక్క శతకం సాధించలేదు.
రిషబ్ పంత్-747 పాయింట్లు
భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గడంలో పంత్ కీలకపాత్ర పోషించాడు. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లాండ్తో రీస్లోనూ సత్తాచాటాడు. టెస్టు కెరీర్లో అత్యుత్తమంగా ఆరో ర్యాంకు సాధించాడు.
రోహిత్ శర్మ-747 పాయింట్లు
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ 747 పాయింట్లతో ర్యాంకింగ్స్లో 8వ స్థానంలో నిలిచాడు.
ఇంగ్లాండ్తో 4 టెస్టుల సిరీస్లో 345 పరుగులు సాధించాడు. టెస్టు ఛాంపియన్షిప్తో పాటు ఇంగ్లాండ్తో సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో రోహిత్ స్థానం దక్కించుకున్నాడు.