షాద్నగర్, సెప్టెంబర్ 30 : సకల జనులకు సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ సర్కారు అందిస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం ఫరూఖ్నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో, చౌదరిగూడ మండల కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరలను అందజేసిన సందర్భంగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. అన్ని మతాల ప్రజలకు సముచిత గౌరవాన్ని కల్పించడంతో పాటు వారి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా పండుగలకు బట్టలు, కానుకలను అందజేస్తున్నారని పేర్కొన్నారు. కొందుర్గు మండలం మహాదేవ్పూర్ గ్రామానికి చెందిన మానయ్యకు దళితబంధు పథకం ద్వారా మంజూరైన రూ. 10 లక్షల ట్రాక్టర్ను అందజేశారు. చౌదరిగూడ మండల కేంద్రంలో మండలానికి చెందిన పలువురి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. మొగిలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని విద్యార్థినులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. చౌదరిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడారు. కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, జడ్పీటీసీలు పి. వెంకట్రాంరెడ్డి, స్వరూప, ఎంపీపీ ఖాజాఇద్రీస్, నాయకులు నారాయణయాదవ్, రామకృష్ణ, శ్రీధర్రెడ్డి, దామోదర్రెడ్డి, నర్సింగరావు, బాబూరావు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు.
ఉప్పరిగూడలో..
మండల పరిధిలోని ఉప్పరిగూడ గ్రామపంచాయతీ సమావేశం శుక్రవారం సర్పంచ్ ఆధ్వర్యంలో మహిళలకు గ్రామపంచాయతీ ఆవరణలో బతుకమ్మ చీరలను సర్పంచ్లఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈర్లపల్లి గ్రామంలో
మండల పరిధిలోని ఈర్లపల్లి గ్రామంలో శుక్రవారం బతుకమ్మ చీరలను సర్పంచ్ ముత్తంగి రాజశేఖర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వర్ణలతాభాస్కర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేటలో..
పెద్దఅంబర్పేట, పసుమాముల, తట్టిఅన్నారం, మర్రిపల్లి తదితర వార్డుల్లో మహిళలకు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, కౌన్సిలర్లు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి, కౌన్సిలర్లు దేవిడి గీతారెడ్డి, రోహిణిరెడ్డి, అర్చన, శ్రీధర్రెడ్డి, రమావత్ పరశురాంనాయక్, మండల కోటేశ్వరరావు, విద్యారెడ్డి, కృష్ణారెడ్డి, నాయకులు వేణుగోపాల్రెడ్డి, మున్సిపల్ సిబ్బంది శ్రీశైలం పాల్గొన్నారు.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీటీసీ మాలతి, కౌకుంట్ల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాగార్జునరెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో బతుకమ్మ చీరలను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నదన్నారు. సర్పంచ్ గాయత్రి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మంచాల మండలంలో..
మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం బతుకమ్మ చీరలను గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్లు మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో జగన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, నాగరాజుగౌడ్, జంగయ్య యాదవ్, శ్రీనివాస్రెడ్డి, రఘునాయక్, రాజునాయక్, పద్మ, ఎల్లంకి అనిత, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిగూడలో..
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ అన్నారు. మండల పరిధిలోని నాగిరెడ్డిగూడ గ్రామంలో శుక్రవారం గ్రామ ఇన్చార్జి సర్పంచ్ సురేందర్గౌడ్తో కలిసి ఆసరా కార్డులు, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అర్జున్, ఎంపీడీవో సంధ్య, కార్యదర్శి స్వప్న పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని నాగరగూడ సర్పంచ్ ఈదుల కృష్ణాగౌడ్ అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని నాగరగూడ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డలకు దసరా పండుగకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సహకార సంఘం మాజీ చైర్మన్ నర్సింహులుగౌడ్, ఉప సర్పంచ్ శ్రీను, పీఆర్ఆర్ యూత్ మెంబర్ ప్రశాంత్గౌడ్, మహిళలు పాల్గొన్నారు.