హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో మంగళవారం లండన్లో చేనేత బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలలనుంచి విచ్చేసిన రెండు వేలకుపైగా ప్రవాస కుటుంబాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, భారత హైకమిషన్ ప్రతినిధి లక్ష్మీనారాయణన్, స్థానిక డిప్యూటీ మేయర్ ఆదేశ్ ఫర్మాన్ తదితరులు హాజరయ్యారు.
మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణ ప్రభుత్వం చేనేతకు చేయుతనిస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో తామూ చేనేత వస్ర్తాలు ధరించి బతుకమ్మ,దసరా జరుపుకొన్నామని టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపా రు. వేడుకల్లో యాదాద్రి దేవాలయ నమూనాను ప్రదర్శించామని చెప్పారు. అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. టాక్ వ్యవస్థాపకుడిగానే కాకుండా ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా దాదాపు దశాబ్దకాలం లండన్ గడ్డపై పనిచేశానని, నేడు అతిథిగా ఇదే గడ్డపై ఈ వేడుకలకు హాజరుకావడం గర్వంగా ఉన్నదన్నారు.
కార్యక్రమంలో టాక్ ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల, ఈవెంట్స్ ఇన్చార్జి మల్లారెడ్డి, టాక్ కమ్యూనిటీ ఎఫైర్స్ చైర్మన్ నవీన్రెడ్డి, టాక్ ప్రధాన కార్యదర్శి సురేశ్ బుడగం, జాహ్నవి దూసరి, టీఆర్ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడు అశోక్గౌడ్ దూసరి, మట్టారెడ్డి, పవిత్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.