హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ, మండలి కార్యాలయాల వద్ద బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మలను అందంగా పేర్చి బొడ్డెమ్మ ఆడారు. ఈ వేడుకల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేంద్ రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు పాల్గొని బతుకమ్మలను వీక్షించారు. ఇక బతుకమ్మ పాటలకు ఎమ్మెల్సీలు కవిత, సురభి వాణిదేవి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, మహిళా కార్యకర్తలు బొడ్డెమ్మ ఆడారు.
అసెంబ్లీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనమండలి ఎదుట నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, కార్యకర్తలు.. @RaoKavitha #padmadevenderreddy pic.twitter.com/dWASTvKWqb
— Namasthe Telangana (@ntdailyonline) September 28, 2022