హైదరాబాద్, ఆగస్టు 17: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రత్యేకంగా ‘బరోడా తిరంగా డిపాజిట్’ స్కీంను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేకంగా ప్రకటించిన ఈ డిపాజిట్ స్కీంలపై అదనపు వడ్డీని ఆఫర్ చేస్తున్నది. ఈ స్కీం డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుందని బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రూ.2 కోట్ల లోపు 444 రోజుల కాలపరిమితితో కూడిన దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లపై 5.75 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నది. అలాగే 555 రోజుల కాలపరిమితిపై 6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు మాత్రం అదనంగా మరో అర శాతం చెల్లించనున్నది. ఈ సందర్భంగా బ్యాంక్ ఈడీ అజయ్ కే ఖురానా మాట్లాడుతూ..75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డిపాజిట్దారులకు అధిక రిటర్నులు అందించాలనే ఉద్దేశంతో తిరంగా డిపాజిట్ స్కీంను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.