జవహర్నగర్, సెప్టెంబర్ 19 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిరసిస్తూ జవహర్నగర్ కార్పొరేషన్లో వెలిసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. ‘తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్షా చెప్పుల వద్ద తాకట్టు పెడితివి? ప్రధాని మోదీ దేవుడంటివి అన్నా.. కానీ ఆయన మాత్రం గ్యాస్ ధర రూ.414 నుంచి రూ.1105.. నూనె రూ.65 నుంచి రూ.210లు పెంచిండు. దేశ సంపదను అదానీ, అంబానీలకు పంచుతున్నడు.’ అని వాల్పోస్టర్ల ద్వారా విమర్శించారు.
ఇదిలా ఉంటే సోమవారం ఫైరింగ్ రేంజ్ నుంచి అంబేద్కర్నగర్ వరకు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో ఆ పార్టీ నేతల హంగామా తప్ప…ప్రజా సమస్యలపై పట్టింపే లేదని స్థానికులు నిట్టూర్చారు. ఈ యాత్రలో పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన కిరాయి వ్యక్తులే తప్ప.. స్థానికులెవరూ లేరని ఎద్దేవా చేశారు.