ఇండియాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై జూలై 1 నుంచి నిషేధం అమల్లోకి రానున్నది.
దేశవ్యాప్తంగా వచ్చే నెల 1 నుంచి సింగిల్ యూజ్ (ఒకసారి వాడిపారేసే) ప్లాస్టిక్పై నిషేధం అమల్లోకి రానున్నది. దీంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, స్ట్రాలు, కప్పులు, కవర్లు వంటివి కనుమరుగు కానున్నాయి.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే
పాలిథీన్ కవర్లు, స్ట్రాలు లాంటి ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు.
వేటిపై నిషేధం
ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, చంచాలు, కత్తులు, ట్రేలు, బెలూన్ స్టిక్స్, ఇయర్ బడ్స్, సిగరెట్ ప్యాకెట్స్, ఇన్విటేషన్ కార్డ్స్, ఐస్క్రీమ్లలో వాడే ప్లాస్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ స్వీట్బాక్సులు, 100 మైక్రాన్లలోపు మందం ఉండే పీవీసీ బ్యానర్లు, అలంకరణలో వాడే థర్మోమోల్ తదితరాలు
నిషేధం ఎందుకు?
ప్లాస్టిక్ను వాతావరణంలో వదిలేస్తే అది మైక్రోప్లాస్టిక్స్గా మారి ఆహార పదార్థాల ద్వారా మానవ శరీరంలోనికి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. శాస్త్రవేత్తలు ఇటీవలే రక్తంలో మైక్రో ప్లాస్టిక్స్ను గుర్తించారు.
మూడో వంతు
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మొత్తం ప్లాస్టిక్లో 1/3వ వంతు సింగిల్ యూజ్ ప్లాస్టికే. ఇందులో 98% శిలాజ ఇంధనాల నుంచే తయారు చేస్తున్నారు.
130 మిలియన్ టన్నులు
ప్రపంచవ్యాప్తంగా ఒక ఏడాదిలో పోగవుతున్న సింగిల్యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలు 130 మిలియన్ టన్నులు. ఇది ఏటికేడు పెరుగుతున్నది.
5.6 మిలియన్ టన్నులు
ప్లాస్టిక్ను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఇండియా 94వ స్థానంలో ఉంది. ఇండియాలో ఏడాదికి 5.6 మిలియన్ టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి.
రూ.3వేల కోట్లు
నిషేధం వల్ల పరిశ్రమలకు 3వేల కోట్ల నష్టం వస్తుందని యాక్షన్ అలయన్స్ ఫర్ రీసైక్లింగ్ బెవరేజ్ కార్టన్స్(ఆర్క్) అంచనా వేసింది.
ఉల్లంఘిస్తే జైలు
ప్లాస్టిక్పై నిషేధాన్ని కేంద్ర స్థాయిలో సెంటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ), రాష్ట్రస్థాయిలో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(ఎస్పీసీబీ) పర్యవేక్షిస్తుంది. నిషేధాన్ని ఉల్లంఘిస్తే ఇన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చట్టం-1986 కింద ఐదేండ్ల వరకు జైలు శిక్ష(లేదా) లక్ష రూపాయల జరిమానా(లేదా) రెండూ విధించవచ్చు.
2021లో యునైటెడ్ నేషన్స్ ఇన్విరాన్మెంట్ అసెంబ్లీ ప్లాస్టిక్ పొల్యూషన్ను నియంత్రించేందుకు తీర్మానం చేసింది. దీనిపై ఇండియా సహా 124 సభ్య దేశాలు సంతకాలు చేశాయి. 2019 జూలై వరకు 68 దేశాల్లో ప్లాస్టిక్ బ్యాగ్లపై నిషేధం అమల్లో ఉంది.