ప్రభుత్వ విప్ బాల్క సుమన్
రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు వినతి
చెన్నూర్, జూన్ 30: చెన్నూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని 26 గ్రామ పంచాయతీల భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును గురువారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
చెన్నూర్ మండలంలోని అంగ్రాజుపల్లి, సుందరశాల, పొక్కూరు, సోమన్పల్లి, కోటపల్లి మండలంలోని అన్నారం, దేవులవాడ, మల్లంపేట, నాగంపేట, నక్కలపల్లి, పారుపల్లి, పుల్లగాం, ఆల్గాం, రాంపూర్, రొయ్యలపల్లి, షట్పల్లి, సిర్సా, భీమారం మండలంలోని ఆరెపల్లి, పోలంపల్లి, ఖాజీపల్లి, నర్సింగపూర్, జైపూర్ మండలంలోని నార్వ, వెంట్రావుపల్లి, మందమర్రి మండలంలోని పులిమడుగు, ఆదిల్పేట, బొక్కలగుట్ట గ్రామ పంచాయతీలకు శాశ్వత గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. నిధుల మంజూరుకు మంత్రి దయాకర్రావు సానుకూలంగా స్పందించారని విప్ సుమన్ తెలిపారు. త్వరలోనే నిధులు మంజూరవుతాయని, గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు.
మంత్రి ఐకేరెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు
బోథ్, జూన్ 30 : ఇటలీ పర్యటనను ముగించుకుని వచ్చిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిని గురువారం బోథ్, మంచిర్యాల ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, నడిపెల్లి దివాకర్రావులు మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని మంత్రి కార్యాలయంలో కలిసి మొక్కను అందజేసి శాలువాలతో సత్కరించారు. అనంతరం తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల విషయమై మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక నిధులు కేటాయించాలని విన్నవించారు.