చెన్నూర్, జూలై 7: రాష్ట్రంలోని దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు తీస్తున్నదని చెప్పారు.