సీఎస్కు ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దివాకర్రావు, చిన్నయ్య విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): సింగరేణి ప్రాంతంలో ఇండ్ల పట్టాలకు సంబంధించి విడుదల చేసిన జీవో 76 కాలపరిమితిని మరో 2 నెలలు పొడిగించాలని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు బాల్కసుమన్, నడిపల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య కోరారు. ఈ మేరకు సోమవారం బీఆ ర్కే భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
చెన్నూరు పట్టణంలోని ఆబాది భూముల సమస్యను పరిష్కరించాలని, చెన్నూరు ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కోరారు. బెల్లంపల్లి పట్టణంలో ఎస్ఆర్టీ క్వార్టర్స్ సమస్యను, మంచిర్యాల జిల్లాలో రెవెన్యూ-అటవీ శాఖల మధ్య నెలకొన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎస్కు విజ్ఞప్తి చేశారు.