బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఎన్బీకే-107’వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. శృతిహాసన్ కథానాయిక. శనివారం దివంగత ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ కత్తి పట్టుకొని రక్తం చిందిస్తూ ఉగ్రరూపంలో కనిపిస్తున్నారు.
‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాం. బాలకృష్ణ పాత్ర పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పటికే నలభైశాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం ద్వారా కన్నడ నటుడు దునియా విజయ్ ప్రతినాయకుడిగా తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు’ అని చిత్రబృందం పేర్కొంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబీ, సంగీతం: తమన్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, సీఈఓ: చిరంజీవి (చెర్రీ), నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.
ఎన్టీఆర్ పెద్దకుమారుడు నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ఆరంభించారు. శనివారం ఈ బ్యానర్ను అగ్ర హీరో బాలకృష్ణ ఆవిష్కరించారు. జయకృష్ణ కుమారుడు చైతన్యకృష్ణని కథానాయకుడిగా పరిచయం చేస్తూ వంశీకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఇది మా అన్నదమ్ములందరి బ్యానర్. హీరోగా పరిచయమవుతున్న చైతన్యకృష్ణ మంచి నటనతో ప్రేక్షకుల్ని మెప్పించాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’ అన్నారు.