మిల్వాకీ: బేకరీ దొంగను పట్టుకునేందుకు కుకీలే నయమనుకున్నారు యజమానులు. కాన్ఫోరా బేకరీలో దొంగ ప్రవేశించాడు. ఉన్న సొమ్మంతా ఎత్తుకుని ఉడాయించాడు. ఎరిక్, కారెన్ క్రీగ్ దంపతులు ఆ బేకరీ యజమానులు. వారికి ఆ బేకరీయే జీవనాధారం. తమ సంపాదన అంతా దోచుకుపోయిన దొంగ ఫొటో సెక్యూరిటీ కెమెరాల్లో క్లియర్గా రికార్డయింది. దానిని 100 సుగర్ కుకీలపై ముద్రించి కస్టమర్లకు పంచారు. ఎవరికైనా తెలిస్తే చెప్పమని విజ్ఞప్తి చేశారు. గత నెల 19న అర్దరాత్రి ఓ దొంగ బేకరీలో దూరాడని, ఇనుపబీరువా తాళాలు తీగతా తీసి అందులో ఉన్న సొమ్మంతా పట్టుకుపోయాడని మిల్వాకీ నుంచి వెలువడే సెంటినెల్ పత్రిక రాసింది. కొన్నిపరాల పరికరాలను కూడా తీసుకుపోయాడట. అనుమానితుని పట్టుకునేందుకు యజమానులు కుకీలపై ఫొటోను ముద్రించి ఆచూకీ తెలుపాల్సిందిగా స్థానిక ప్రజలకు పంచారని వివరించింది. ఫేస్బుక్లో కూడా ఆ ఇమేజీని షేర్ చేశారు. కుటుంబానికి ఒకటిచొప్పున మాత్రమే కుకీని ఇస్తామని, దానిని చూసి, కొరికి దొంగను గుర్తించాలని కోరారు.