బడంగ్పేట, సెప్టెంబర్ 25: బీజేపీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు విసిగిపోయి ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా మహిళామోర్చా కార్యదర్శి ఆకుల సరితా పటేల్, ఉపాధ్యక్షురాలు రమ్యశ్రీ ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. వీరికి విద్యా శాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రధాన పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ బడంగ్పేట అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్ బీమిడి స్వప్న జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.