వరంగల్ : మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీనవర్గాల నేత బాబూ జగ్జీవన్ రామ్ అందరికీ స్ఫూర్తి ప్రధాత అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు.
జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత, దళిత వర్గాల పెన్నిధి జగ్జీవన్ రామ్ అని అన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎనలేదని అన్నారు.
అంటరాని వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన గొప్పనేత జగ్జీవన్ రామ్ అని ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు.
అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. యువత జగ్జీవన్ రామ్ చూపిన మార్గంలో నడవాలని సూచించారు.
కార్యక్రమంలో స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి