గోపాల్పేట, అక్టోబర్ 4: మెట్ట ప్రాంతాలకూ సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఆయకట్టును పెంచుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని చాకలిపల్లి శివారులో మంత్రి సొంత ఖర్చులతో నిర్మించిన మైనర్ కాల్వను మంగళవారం జెడ్పీచైర్మన్ లోకనాథ్రెడ్డితో కలిసి పొలాలకు సాగునీరు విడుడల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులు బాగుంటేనే సమాజం బాగుంటుందన్న ఆలోచనతోనే ప్రభుత్వం రైతులకు సాగునీరు, ఉచిత కరెంట్ను అందిస్తుందన్నారు. అన్నిరంగాలు వ్యవసాయ ఆర్థికాభివృద్ధిపైనే ఆధారపడి ఉంటాయన్నారు. వివిధ కులవృత్తులు వ్యవసాయం బాగుంటేనే వృద్ధి చెందుతాయన్నారు. ఎనిమిదేండ్లలో గ్రామాల్లో మారిన రూపురేఖలే నిదర్శనమన్నారు. రైతులు కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకోవాలని, వర్షాలు ప్రారంభమైన ప్రతిసారి ముఖ్యమంత్రి అప్రమత్తం చేయడం వట్ల చెరువులు, కుంటలను ఎప్పటికప్పుడు నిండుగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలోనే వనపర్తి జిల్లాలో భూగర్భజలాలు అత్యధికంగా పెరిగాయన్నారు. గ్రామ శివారులో డీ-8కాల్వపై 5వ కాల్వ నుంచి మైనర్కాల్వ ద్వారా గోపాల్పేట, ఎర్రగట్టుతండాకు నీటిని విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. కొత్త కాల్వతో 300ఎకరాలకు సాగునీరు అందనున్నదన్నారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా రైతులకు సాగునీటి కాల్వను ప్రారంభించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. పంటల మార్పిడి, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని మంత్రి రైతులకు అవగాహన కల్పించారు. అన్ని కాలాల్లో అవసరమైన పంటలను పండించేందుకు రైతువేదికల ద్వారా చైతన్యం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు కేక్ కట్చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మంత్రి నిరంజన్రెడ్డి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, ఎంపీడీవో ఉస్సేనప్ప, ఎంపీపీలు సంధ్య, బంకల సేనపతి, కిచ్చారెడ్డి, వైస్ఎంపీపీ చంద్రశేఖర్, జెడ్పీటీసీ భీమయ్య, డీసీఎంఎస్ వైస్చైర్మన్ హర్యనాయక్, సింగిల్విండో చైర్మన్ రఘుయాదవ్, మధుసూదన్రెడ్డి, వైస్చైర్మన్ గువ్వల రాములు, పార్టీ శిక్షణ తరగతుల జిల్లా కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు తిరుపతియాదవ్, కో ఆప్షన్ సభ్యులు ఎండీ మతీన్, పార్టీ మండల అధ్యక్షుడు గాజుల కోదండం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వడ్డెమాన్ రవి, ప్రధానకార్యదర్శి శేఖర్, గ్రామ అధ్యక్షుడు మణ్యంనాయక్, శేషిరెడ్డి, సర్పంచులు శ్రీనివాసులు, శంకర్నాయక్, శేఖర్యాదవ్, ఎంపీటీసీలు రేణుక, నరేందర్, బాల్రెడ్డి, నాయకులు జానకీరాంరెడ్డి, రమేశ్గౌడ్, సుదర్శన్రెడ్డి, పాపిరెడ్డి, నరేశ్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.