అహ్మదాబాద్: నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత వరుస ఓవర్లలో రెండు వికెట్లు చేజార్చుకున్నది. 28వ ఓవర్లో ఓలీ పోప్ను అశ్విన్ బౌల్డ్ చేయగా..ఆ తర్వాతి ఓవర్లో బెన్స్టోక్స్ను అక్షర్ పటేల్ ఎల్బీడబ్లూగా పెవిలియన్ పంపాడు. భారత స్పిన్నర్లు తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని కుప్పకూల్చారు.
జాక్ క్రాలే(53) ఒక్కడే అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. క్రాలేతో కలిసి జో రూట్(17) కొద్దిసేపు ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా అశ్విన్ వెనక్కి పంపాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇంగ్లాండ్ 88/6తో పీకల్లతో కష్టాల్లో పడింది. ప్రస్తుతం బెన్ ఫోక్స్(1), జోఫ్రా ఆర్చర్(6) క్రీజులో ఉన్నారు.