నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని సింగీతం, తెల్గపూర్, మగ్దుంపూర్, బ్రహ్మణపల్లి, వెల్గనూర్, గోర్గల్, అచ్చంపేట, మంగ్లూర్ గ్రామాలలో శుక్రవారం దళితబంధు పథకంపై అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఆయా గ్రామాలలో వారికి కేటాయించిన క్లస్టర్ అధికారులు పాల్గొని దళితులకు దళితబంధు పథకం గురించి వివరించారు. మంగ్లూర్, గోర్గల్, నర్సింగ్రావ్పల్లి గ్రామాలలో జిల్లా డీవీఎహెచ్ అధికారి జగన్నథచారి, వెల్గనూర్, ఆరేపల్లి, బ్రాహ్మణపల్లి , అచ్చంపేట గ్రామాలలో ఏడీ ఇండస్ట్రీస్ రఘునాథ్, సింగీతం, తెల్గాపూర్, మగ్దుంపూర్ గ్రామాలలో జడ్పీ సీఈవో సాయాగౌడ్ దళితులకు అవగాహన కల్పించారు.
ప్రభుత్వం అందించే పది లక్షల రూపాయలతో ఎన్ని యూనిట్లు ఉన్నాయి. ఏ యూనిట్లు నెలకొల్పుకోవచ్చు తదితర అంశాలను వివరించారు. పలు రకాల యూనిట్ల కోసం శిక్షణ సైతం అందించి అందుకు సంబంధించిన యూనిట్ను అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, మండల ప్రత్యేకాధికారి సంజీవ్రావ్, ఎంపీపీ పర్బన్న, మండల పంచాయతీ అధికారి అబ్బాగౌడ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విఠల్, వైస్ ఎంపీపీ మనోహార్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేశ్గౌడ్, సర్పంచులు తదితరులు ఉన్నారు.