డెహ్రాడూన్, అక్టోబర్ 4: ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లాలోని ద్రౌపది కా దండా-2 శిఖరాగ్రంపైన అకస్మాత్తుగా హిమపాతం సంభవించగా, అందులో చిక్కుకున్న పదిమంది శిక్షణ పర్వతారోహకులు మృతిచెందారు. వీరంతా నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఐఎం)కు చెందినవారు. హిమపాతంలో చిక్కుకున్న ఎనిమిది మందిని తమ బృందం కాపాడిందని ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ కల్నల్ అమిత్ బిష్త్ పేర్కొన్నారు. పది మృతదేహాలను గుర్తించామని, నాలుగు మృతదేహాలను వెలికితీసినట్టు చెప్పారు. ఉదయం 8.45 గంటల ప్రాంతంలో హిమపాతం సంభవించిందని, తమ ఇన్స్టిట్యూట్కు చెందిన 34 మంది పర్వతారోహకులతోపాటు ఏడుగురు ఇన్స్ట్రక్టర్లు చిక్కుకుపోయారని ప్రిన్సిపాల్ వెల్లడించారు.
ఉత్తరాఖండ్లోని పౌరి జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న పెండ్లి బస్సు లోయలో పడింది. దీంతో భారీగాప్రాణనష్టం జరిగినట్టు తెలుస్తున్నది.