పెర్త్ : భారతదేశం నుంచి తిరిగి వచ్చే తమ పౌరులపై నిషేధాన్ని వచ్చే శనివారం నుంచి ఆస్ట్రేలియా ఎత్తివేయనున్నది. స్వదేశానికి తిరిగి వచ్చే విమానం అదే రోజు డార్విన్ నగరంలో ల్యాండ్ అవుతుందని ప్రధాని స్కాట్ మోరిసన్ శుక్రవారం చెప్పారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం చరిత్రలో తొలిసారిగా భారతదేశం నుంచి పౌరులు ఆస్ట్రేలియాకు రాకుండా తాత్కాలిక నిషేధం విధించింది. అయితే, ఇప్పుడు ఈ నిషేధం వచ్చే శనివారం నుంచి ఎత్తివేయనున్నారు.
గతంలో విధించిన నిషేధాన్ని పాటించనవారికి ఐదేండ్ల జైలు శిక్ష లేదా 66 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి ఎంపీలు, వైద్యులు, వ్యాపారవేత్తలు, పౌర సమాజం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశం నుంచి తిరిగి వచ్చే వారికి జరిమానా విధించడం, జైలుకు పంపుతామని చెప్పడం అవివేకమని ముక్తకంఠంతో నిరసించారు.
ప్రభుత్వ ఉత్తర్వు బహుశా మే 15 న ముగిసే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశం అనంతరం.. మోరిసన్ ఈ తేదీని మరింత పొడిగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారతదేశంలోని హైకమిషన్, కాన్సిలర్ కార్యాలయంలో నమోదు చేసుకున్న ఆస్ట్రేలియా పౌరులను మాత్రమే తిరిగి తీసుకువస్తామని మోరిసన్ వెల్లడించారు. అందువల్ల ఆస్ట్రేలియా తన పౌరులను తిరిగి తీసుకురావడానికి మే 15 – 31 మధ్య భారతదేశం నుంచి మూడు విమానాలను నడుపనున్నది. మొదటి విమానం మే 15 న డార్విన్కు చేరుకుంటుంది. భారతదేశం నుంచి నేరుగా ఆస్ట్రేలియాకు వాణిజ్య విమానాలను ఇప్పటికే నిషేధించారు.
భారత్కు 10 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను పంపిన ఐరాస
మాల్దీవుల మాజీ అధ్యక్షుడిపై దాడి.. పేలుడులో గాయాలు
కాలువలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు.. 671 వయల్స్ స్వాధీనం
టోక్యో ఒలింపిక్స్పై కరోనా పంజా: రద్దు చేయాలంటూ ప్రధానికి విజ్ఞప్తి
కెనడాలో కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం.. భారతీయులకే ఎక్కువ ప్రయోజనం
ఆన్లైన్ బుక్ చేసుకుంటే.. ఆక్సిజన్ హోం డెలివరీ..
కరెనా ఎఫెక్ట్ : విదేశాల్లో పెరిగిన భారతీయ విద్యార్థుల ఇబ్బందులు
మే 15 వరకు బీహెచ్యూ మూసివేత.. జూన్ 30 వరకు పరీక్షలు రద్దు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..