హైదరాబాద్ : ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ను ఆస్ట్రేలియా టీఆర్ఎస్ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆస్ట్రేలియా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కాసర్ల నాగేందర్ రెడ్డి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ను నాగేందర్ రెడ్డి కలిసి.. ఆస్ట్రేలియాలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం పథకాల గురించి విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న తీరును వివరించారు. దీంతో నాగేందర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు.
పార్టీ కోసం నిరంతరం ఇలాగే కష్టపడి పనిచేయాలని మంత్రి కేటీఆర్ కాసర్లకు సూచించారు. సోషల్ మీడియాలో అబద్ధపు విష ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించడంతో పాటు వారి గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలని మంత్రి కేటీఆర్ కాసర్లకు సూచించారు. దీంతోపాటు రాష్ట్రానికి వివిధ రంగాల్లో పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. ఎన్ఆర్ఐలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని కేటీఆర్ తనతో పేర్కొన్నారని కాసర్ల నాగేందర్రెడ్డి తెలిపారు.