టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన ఆస్ట్రేలియా.. తన తొలి మ్యాచ్లో న్యూజిల్యాండ్ చేతిలో ఘోరపరాజయం చవి చూసింది. దీంతో మిగతా మ్యాచుల్లో ఎలాగైనా గెలవాలని కసిగా ఉంది. ఈ క్రమంలోనే మంగళవారం నాడు శ్రీలంకతో తలపడేందుకు సిద్ధమైంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు సారధి ఆరోన్ ఫించ్ తాము ముందుగా ఫీల్డింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే కరోనా కారణంగా స్పిన్నర్ ఆడమ్ జంపా ఆడటం లేదని, అతని స్థానంలో ఆస్టన్ అగర్ ఆడుతున్నాడని తెలిపాడు. శ్రీలంక సారధి దాసున్ షనక మాట్లాడుతూ.. తాము ముందుగా బ్యాటింగ్ చేయడానికైనా, ఛేజ్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నాడు. అలాగే జట్టులోని పాథుమ్ నిస్సంకను తీసుకున్నట్లు వెల్లడించాడు.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టొయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆస్టన్ అగర్, జోష్ హాజిల్వుడ్
శ్రీలంక జట్టు: పాథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వ, చరిత్ ఆసలంక, భానుక రాజపక్స, దాసున్ షనక (కెప్టెన్), వానిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీష్ తీక్షణ, బినురా ఫెర్నాండో, లాహిరు కుమార