టీ20 ప్రపంచకప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు జోరు పెంచారు. డేవిడ్ వార్నర్ (11), మిచెల్ మార్ష్ (18) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరినా.. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (23 నాటౌట్) నెమ్మదిగా ఇన్నింగ్స్ వేగం పెంచాడు. మార్ష్ అవుటైన తర్వాత అతనికి జత కలిసిన గ్లెన్ మ్యాక్స్వెల్ (6 బంతుల్లో 22 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
దీంతో ఆ జట్టు స్కోరుబోర్డు పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే తొలి ఆరు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా బాదని ఆసీస్ జట్టు.. ఆ తర్వాత నాలుగు ఓవర్లలో ఏడు బౌండరీలు బాదింది. వీటిలో మ్యాక్స్వెల్ ఒక్కడే రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఆ జట్టు పది ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులతో నిలిచింది.