క్రికెట్ ప్రపంచంలో భారత్-పాక్ మ్యాచుల తర్వాత అంతటి వైరం కనిపించేది యాషెస్ సిరీస్లోనే. అలాంటి సిరీస్ను ఈసారి ఇంగ్లండ్ అత్యంత పేలవంగా ప్రారంభించింది. గబ్బాలో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోయింది. చివరి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ముందు కేవలం 20 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్ గురించి ఆసీస్ మాజీ దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు.
ఈ సిరీసులో ఆస్ట్రేలియా మరింత పట్టు బిగిస్తుందని జోస్యం చెప్పిన పాంటింగ్.. గబ్బా టెస్టులో ఇంగ్లిష్ పేసర్లు ఆండర్సన్, బ్రాడ్ ఆడకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘ఆండర్సన్, బ్రాడ్ ఇద్దరినీ ఆడించకపోవడం వెనుక ఉన్న వ్యూహం నాకింకా అర్ధంకాలేదు. వాళ్లిద్దరూ ఆసీస్లో క్రిస్ వోక్స్ స్థాయి బౌలర్లు కూడా కాదా? రెండో టెస్టులో అయినా వారిద్దరిలో కనీసం ఒకరినైనా ఆడించాలి’ అని