ముంబై ,జూలై:జర్మనీకి చెందిన లగ్జరీ కార్ తయారీ సంస్థ ‘ఆడి’ సరికొత్త కార్ ను ప్రవేశ పెట్టింది. భారతదేశంలో మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఈ-ట్రాన్’ ను విడుదల చేసింది. ఈ-ట్రాన్50, ఈ-ట్రాన్55 ,ఈ -ట్రాన్ స్పోర్ట్బ్యాక్ వంటి మూడు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంటుంది. ఆడి ఈ-ట్రాన్ ప్రారంభ ధర రూ. 99.99 లక్షలు. ఇండియా మార్కెట్లో ఈ మోడల్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా ఆడి షో రూమ్ లనుంచి బుక్ చేసుకోవచ్చు. మరికొన్ని రోజుల్లో కారు డెలివరీలు ప్రారంభం కానున్నాయి.