అమరావతి : ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించారనే బాధతో బావ, మరదలు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. జిల్లాలోని పుల్లలచెరువు మండలం గారపెంటకు చెందిన యువతి, ఆమె బావ సావుడి వెంకటేశ్వర్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని బావించారు. అయితే పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరు అడవిలోకి వెళ్లి విషపు ఆకులు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
మరదలు(19) మృతి చెందగా, బావ సావుడి వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.