బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు
మహబూబాబాద్, మార్చి 15: మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నెల్లికుదురులో ఆదివారం బీజేపీ నాయకులు టీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రాంచందర్రావు నేతృత్వంలో 15 మంది ఒక్కసారిగా క్యాంపు కార్యాలయానికి దూసుకొచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని ఆపేందుకు యత్నించారు. అయినప్పటికీ కొంతమంది క్యాంపు కార్యాలయంపైకి రాళ్లు విసిరారు. టౌన్ సీఐ వెంకటరత్నం, రూరల్ సీఐ సుంకరి రవికుమార్ బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని కురవి పోలీస్ స్టేషన్కు తరలించారు.