హైదరాబాద్ : అంగన్వాడీ సిబ్బందిపై దాడులు చేస్తే సహించేది లేదని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తేజావత్ తండా అంగన్వాడీ టీచర్ కమలపై దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్ శశాంక, ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ను ఆదేశించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సూచించారు.
వ్యక్తిగతంగా రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. ధైర్యంగా ఉండాలని, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఏదైనా పొరపాటు జరిగితే ఫిర్యాదు చేస్తే తాము చర్యలు తీసుకుంటామని, ఇలా దాడులకు తెగబడితే సహించేది లేదని స్పష్టంచేశారు. అంగన్వాడీ టీచర్కు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, సీడీపీఓ దెబొర, బాధితురాలు కమల మంత్రిని కలెక్టరేట్లో కలిసి ఘటనపై వివరించారు.