యాదాద్రి: ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తుర్కపల్లి మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పడాల శ్రీనివాస్తో పాటు తుర్కపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు పడాల పెద్ద శ్రీనివాస్, తిరుమలాపూర్ టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు సుంటి నరేశ్, సామల కరుణాకర్, ఇమ్మడి అనిల్ను పార్టీ నుంచి ఆరేండ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి స్పష్టం చేశారు.
శనివారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ మండల కార్యవర్గం ఎన్నికల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డితోపాటు ఎస్టీ వర్గానికి చెందిన మహిళా ఎంపీపీ, ఎన్నికల ఇన్చార్జిలు కాసావు శ్రీనివా స్, గౌటే లక్ష్మణ్, అర్కాల గాల్రెడ్డిలపై భౌతిక దాడులకు పాల్పడి, గాయపరిచినందుకు వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కావాలని కోరుతూ పడాల శ్రీనివాస్ తమను అభ్యర్థించారని తెలిపారు. ఖచ్చి తంగా ప్రయత్నాలు చేస్తామని, ఇప్పటికే పలు ధపాలుగా మండలాధ్య క్షుడిగా, మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసిన అనుభవం ఉందని, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి జిల్లా పదవి ఇచ్చేందుకు ప్రయ త్నిస్తామని తెలిపామన్నారు.
కానీ, జిల్లా అధ్యక్ష పదవితోపాటు మండలాధ్యక్ష పదవి సైతం తనకే కావాలని వాదనకు దిగారని అన్నారు. ఈ మేరకు శనివారం తుర్కపల్లిలో జరిగిన మండల పార్టీ కార్యవర్గ ఎన్నికల్లో తన అనుచరులతో దాడి చేయించారని ఆరోపించారు. అవకాశం ఇస్తే ఒకతీరు, ఇవ్వకుంటే మరో తీరుగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. డీసీసీబీ చైర్మన్పై దాడి చేయడం పట్ల ఆలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారని గుర్తు చేశారు.
ఆలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు ఆయన, ఆయన అనుచరగనంపై ఆరేండ్ల పాటు అనర్హత వేటు వేసినట్లు తెలిపారు. ఏడాదిగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నా పద్దతి మార్చుకుంటారని భావించి ఊరుకు న్నామన్నారు. కానీ ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని అన్నారు.
భౌతిక దాడులకు పాల్పడితే చూస్తూ ఉపేక్షించేది లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కమిటీలు, వార్డు కమిటీల నియామకం విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరిం చారు. క్రమశిక్షణ కలిగిన టీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి దుశ్చర్యలకు పాలు పడితే చర్యలు తప్పవన్నారు.
ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని కులాలు, వర్గాలకు సముచిత స్థానం కల్పించామన్నారు. మోటకొండూర్ మండ లంలో ఎస్సీ వర్గానికి పట్టం కట్టామన్నారు. మండల కార్యవర్గం ఎన్నికలపై అన్ని కులాలు, మతాల నాయకులు ఆనం దంతో స్వాగతిస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీదర్గౌడ్, టీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్, నాయకులు కీసరి బాలరాజు, గడ్డం చంద్రంగౌడ్, బిట్టు కుమార్, లఖాన్ తదితరులు పాల్గొన్నారు.