పెద్దపల్లి: తెలంగాణ వ్యాప్తంగా సెల్ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించినందుకు నాయి బ్రాహ్మణ సేవా సంఘం బుధవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఘనంగా సన్మానించింది. పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంత్రికి పూల బొకే అందజేసి, శాలువాతో సత్కరించి ఘన సన్మానం చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులకు పెద్దపీట వేసిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పోస్ట్ పూరి జితేందర్ రావు, జిల్లా రైతు సమన్వయ సమితి మెంబర్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు భాష తిరుపతి, మేడారం ఎంపీటీసీ మిట్ట తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు, నాయి బ్రాహ్మణ సేవా సంఘం ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి అమర పెళ్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు.