తిరుపతి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు రాత్రి గజ వాహనంపై దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవను నిర్వహించారు.
హైందవ సనాతన ధర్మంలో గజ వాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉందని, రాజసానికి ప్రతీక మదగజమని వేద పండితులు తెలిపారు. రణరంగంలో గానీ, రాజదర్బారుల్లో , ఉత్సవాల్లో గజానిదే అగ్రస్థానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంకణబట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అధికారులు పాల్గొన్నారు.