లక్నో: దసరా వేడుకల నేపథ్యంలో ఏర్పాటు చేసిన రామ్లీలా ఫెయిర్లో ఉయ్యాల విరిగింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఉత్తర ప్రదేశ్కు చెందిన ఘజియాబాద్లో ఈ సంఘటన జరిగింది. శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా గంట స్తంభం వద్ద ఉన్న మైదానంలో వినోద మేళా ఏర్పాటు చేశారు. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం పరిధిలోని ప్రజలు దీనిని సందర్శిస్తున్నారు. అయితే శుక్రవారం ఇక్కడ దురదృష్టకర సంఘటన జరిగింది. గుండ్రంగా తిరిగే ఉయ్యాలలో ఒకటి విరిగి పడింది. దీంతో దానిపై ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కింద పడి గాయపడ్డారు. గాయాలపాలైన ఒక మహిళ, ముగ్గురు పిల్లలను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఈ సంఘటనతో సందర్శకులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి పరుగులు పెట్టడంతో తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో మేళాలో ఏర్పాటు చేసిన తిరిగే రాట్నాలు, ఉయ్యాలను పోలీసులు మూసివేశారు. ఘజియాబాద్ పురపాలక అధికారులు ఈ ప్రమాద సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కొందరు వ్యక్తులు తమ మొబైల్లో రికార్డు చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Ghaziabad – A major accident happened in Ramlila Ghantaghar, 4 people of the same family were injured when the swing broke at Ramlila Maidan in Ghaziabad.#Ghaziabad #Accident pic.twitter.com/B8acCFAPsC
— Prateek Pratap Singh (@PrateekPratap5) October 1, 2022