హో చి మిన్: వియత్నాంలోని హో చి మిన్ నగరంలో ఉన్న కారౌకే కాంప్లెక్స్ బార్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 32కు చేరినట్లు అధికారులు తెలిపారు.మంగళవారం రాత్రి ఆ బార్లోని మూడవ ఫ్లోర్లో ప్రమాదం జరిగింది. దీంతో కస్టమర్లు, సిబ్బంది ట్రాప్ అయ్యారు. రెండవ, మూడవ ఫ్లోర్ల నుంచి నలుగురు కిందకు దూకారు. అగ్నిమాపక సిబ్బంది ఆ బారుకు వచ్చి మంటల్ని ఆర్పారు. మృతిచెందిన 32 మందిలో.. 17 మంది పురుషులు, 15 మంది మహిళలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో బార్లో 60 మంది కస్టమర్లు ఉన్నట్లు తేలింది. బార్లో మొత్తం 29 రూమ్లు ఉన్నాయి. 8 మంది మృతదేహాలను టాయిలెట్లలో గుర్తించారు.