హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అస్సాం సీఎం భద్రత విషయంలో తెలంగాణ పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని అస్సాం డీజీపీ డిమాండ్ చేసినట్టు వివిధ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న వార్తలు అవాస్తవమని తెలంగాణ డీజీపీ కార్యాలయం కొట్టిపారేసింది.
ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అస్సాం డీజీపీ భాసర్జ్యోతి మహంత తెలంగాణ డీజీపీతో ఫోన్లో మాట్లాడారని వివరించింది. హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా అస్సాం సీఎం హిమంత పాల్గొన్న కార్యక్రమంపై వాకబు చేశారని వెల్లడించింది. అంతేగాని టీఎస్ పోలీస్ అధికారులపై చర్యలకు డిమాండ్ చేయలేదని సీపీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు.