న్యూఢిల్లీ : కరోనా కారణంగా ఏడాది పదో, 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దయ్యాయి. ఈ క్రమంలో పరీక్షలపై విద్యార్థులకు ఉన్న అనుమానాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నివృత్తి చేయనున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులతో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సంభాషించనున్నారు. కొవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలతో ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున విద్యార్థులు పలువురు విద్యార్థులు పరీక్షలపై ఉన్న ఆందోళన, సందేహాలు తొలగించాలని సందేశాలు పంపారు. ఈ నేపథ్యంలో క్రమంలోనే సామాజిక మాధ్యమాల ద్వారా అనుమానాలను నివృత్తి చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా కొందరు తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారని, వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని, అయితే సీబీఎస్ఈ పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే.. ట్విట్టర్, ఫేస్బుక్, మెయిల్ పంపాలని సూచించారు. 10,12 తరగతుల బోర్డు పరీక్షలు రద్దు చేసిన సీబీఎస్ఈ.. ప్రత్యామ్నాయ అంచనా విధానాన్ని ప్రకటించింది. పాఠశాలలు.. పదో తరగతి మార్కులను జూన్ 30లోపు సమర్పించాలని ఆదేశించగా.. 12వ తరగతి మార్కులను అంచనా వేయడానికి జూలై 15 వరకు గడువు ఇచ్చింది.