జైపూర్ : ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్యలాల్ హత్యోదంతంపై రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ స్పందించారు. ఉదయ్పూర్ హత్య తీవ్రమైన నేరమని ఈ ఘటనపై తాము సత్వరం స్పందించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు. వారికి అంతర్జాతీయ సంబంధాలున్నాయని గుర్తించామని చెప్పారు. ఇది రెండు మతాల మధ్య జరిగిన ఘటన కాదని వ్యాఖ్యానించారు.
ఉదయ్పూర్ హత్య కేసులో రాజస్ధాన్ ప్రభుత్వ చొరవను పలువురు ప్రశంసించారని, బుధవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైందని చెప్పారు. నేరస్తులను సత్వరమే అదుపులోకి తీసుకోవడంతో పాటు అంతర్జాతీయ లింకులనూ వేగంగా వెలికితీయగలిగామని సీఎం అశోక్ గెహ్లోత్ చెప్పుకొచ్చారు. కాగా ఉదయ్పూర్ హత్య కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించారు. ఈ ఘటన పాకిస్తాన్ ఉగ్ర మూకలకు చెందిన స్లీపర్ సెల్ పనేనని అనుమానిస్తున్నారు.