మహేశ్వరం : సీఎం రిలీఫ్ఫండ్ ఎందరో పేదలకు ఆసరాగా నిలుస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సిరిగిరిపురం గ్రామానికి చెందిన వరికుప్పల యాదయ్యకు ఆరోగ్యం బాగలేకపోవడంతో సీఎం రిలీఫ్ఫండ్కు ధరఖాస్తు చేసుకోగా అతనికి 12వేల రూపాయలు మంజూరయ్యాయి. ఆచెక్కును నగరంలోని మంత్రి నివాసంలో ఆయనకు అందజేశారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని ఆమె అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందేలా ప్రతి కార్యకర్త కృషిచేయాలని ఆమె అన్నారు. ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల యువజన నాయకులు శ్రీను పాల్గొన్నారు.