ముంబై: ఎల్గర్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావుకు పర్మినెంట్ మెడికల్ బెయిల్ను ఎందుకు మంజూరు చేయకూడదో చెప్పాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను బాంబే హైకోర్టు ప్రశ్నించింది. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు గతేడాది హైకోర్టు తాత్కాలిక బెయిల్ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ బెయిల్ను పలుసార్లు పొడిగించింది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు పర్మినెంట్ మెడికల్ బెయిల్ను మంజూరు చేయడం వల్ల తలెత్తే ఇబ్బందులేమిటని ఎన్ఐఏను హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరుగనున్నది.