న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టనుంది. ఇవాళ జరుగుతున్న కౌటింగ్లో ఆ పార్టీ 88 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత రాఘవ చడ్డా మీడియాతో మాట్లాడారు. దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఆమ్ ఆద్మీ ఆవిర్భవిస్తుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని అభ్యర్థిగా ముందు వరుసలో ఉంటారని ఆయన తెలిపారు. ఆప్ ఇప్పుడో జాతీయ శక్తిగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తమ పార్టీ నిలుస్తుందని అన్నారు.