న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీలో తాము ప్రవేశపెట్టిన బడ్జెట్పై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్, బీజేపీలపై సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ వ్యాప్తంగా 500 భారీ జాతీయ పతాకాలను ఏర్పాటు చేస్తూ బడ్జెట్లో నిధులను కేటాయించామని విపక్షాలు ఈ బడ్జెట్ను తప్పుపట్టడం గర్హనీయమని అన్నారు. దేశభక్తి బడ్జెట్పై కాంగ్రెస్, బీజేపీల రాజకీయం తగదని కేజ్రీవాల్ మండిపడ్డారు.
భారత్లో, ఢిల్లీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించకుండా పాకిస్తాన్, ఇస్లామాబాద్లో ఎగురవేస్తారా అని ప్రశ్నించారు. అయోథ్య రామాలయ నిర్మాణం పూర్తికాగానే ఢిల్లీకి చెందిన వృద్ధును అక్కడికి పంపుతామని చేసిన ప్రకటననూ బీజేపీ, కాంగ్రెస్లు విమర్శించాయని ఆక్షేపించారు. కాగా, మార్చి 9న ఢిల్లీ బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఢిల్లీ అంతటా 500 ప్రాంతాల్లో జాతీయ పతాకాలను ఎగురవేస్తామని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించారు.