పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను చూసి గర్వపడుతున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సీఎం భగవంత్ మాన్ తలుచుకుంటే ఆరోగ్య మంత్రి చేసిన అవినీతిని కప్పిపుచ్చగలరని, కానీ అలా చేయలేదన్నారు. ఈ మేరకు సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
”భగవంత్ మాన్…. తమర్ని చూసి ఎంతో గర్విస్తున్నా.. మీ చర్యతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమ్ఆద్మీని చూసి దేశం మొత్తం గర్విస్తోంది. ఈ అవినీతి గురించి ఎవ్వరికీ ఉప్పందలేదు. అటు మీడియాకు గానీ, ఇటు విపక్షానికి గానీ అస్సలు సమాచారమే లేదు. భగవంత్ మాన్ తలుచుకుంటే ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చేవారే కాదు. మంత్రి అవినీతిలో భాగం కావాలనేవారు. కానీ… సీఎం అలా చేయలేదు. మంత్రిపై చర్యలు తీసుకున్నారు ” అంటూ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను అవినీతి నిరోధక శాఖ మంగళవారం అరెస్ట్ చేసింది. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆయన్ను పదవి నుంచి తొలగించారు. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించడంతో… ఏసీబీ వెంటనే విజయ్ సింఘాల్ను అరెస్ట్ చేసింది.
ఈ విషయంపై సీఎం భగవంత్ మాన్ స్పందించారు. మంత్రి విజయ్ సింఘాల్పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన్ను కేబినెట్ నుంచి తొలగించాను. కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశా. తన శాఖలో ఆయన అవినీతికి పాల్పడ్డారు. అవినీతికి పాల్పడినట్లు ఆయన అంగీకరించారు కూడా. తమ ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం ఉపేక్షించదు అని సీఎం భగవంత్ మాన్ స్పష్టం చేశారు.
Proud of you Bhagwant. Ur action has brought tears to my eyes.
Whole nation today feels proud of AAP https://t.co/glg6LxXqgs
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 24, 2022