అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి రాజధాని రైతులతో వెయ్యిరోజులుగా కృత్రిమ ఉద్యమా న్ని నడిపిస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ మయ్యాయి. వివిధ అంశాలపై చర్చ జరిగిన తరువాత చివరగా పరిపాలన వికేంద్రీకరణపై జగన్ మాట్లాడారు. కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ గురించి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు.
మరోసారి అమరావతి రైతులతో మహాపాదయాత్ర నిర్వహిస్తూ మిగతా ప్రాంతాల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తూ, రెచ్చగొడుతూ డ్రామా నడుపుతున్నారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ , పేద ఓసీల కోసం ఉద్యమం చేస్తున్నారా? లేదని అన్నారు. టీడీపీ నాయకులు పెత్తందారి మనస్థత్వంతో పాలన కొనసాగించా రని దుయ్యబట్టారు. తమ బినామీ భూములున్న ప్రాంతమే రాజధాని కావాలని అనుకున్నారని, అమరావతి ప్రాంత ప్రజలపై తనకు ఎలాంటి కోపాలు లేవని పేర్కొన్నారు. మాయమాటలతో మోసం చేస్తున్న చంద్ర బాబు 420 కేసు పెట్టాలని అన్నారు.