ముంబై: మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులకు ముంబై కోర్టు జలక్ ఇచ్చింది. అరెస్టు అయిన మాజీ మంత్రులు అనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్లు .. శుక్రవారం జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయరాదు అని ముంబై కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. మనీల్యాండరింగ్ కేసులో మంత్రి నవాబ్ మాలిక్ ఫిబ్రవరి నుంచి జైలులో ఉన్నారు. మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ కూడా మనీలాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. అయితే శుక్రవారం జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బెయిల్ ఇవ్వాలని ఇద్దరూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించింది. మహారాష్ట్రలో ఆరు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సారి ఏడు మంది పోటీలో ఉండడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది.