న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టయిన జవహర్ లాల్ నెహూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ కరోనా పాజిటివ్గా పరీక్షించారు. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలు ప్రాగణంలోనే ఐసోలేషన్లో ఉన్నాడని తెలిపారు. కొవిడ్-19 లక్షణాలు కనిపించడంతో శనివారం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయడంతో.. సానుకూల ఫలితం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా గతేడాది దిల్లీలో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. గతేడాది ఫిబ్రవరి 24న ఈశాన్య దిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళనల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో సుమారు 50 మంది మృతి చెందగా, మరో 200 మందికి గాయాలయ్యాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ కూడా హత్యకు గురైన విషయం తెలిసిందే.