సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లోని ఉనాలో గల ఇందిరాగాంధీ స్పోర్ట్స్ స్టేడియంలో ఇండియన్ ఆర్మీ మార్చి 18 నుండి 25వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనుంది. రిజిస్టర్డ్ అభ్యర్థులకు మార్చి 14 నుండి అడ్మిట్ కార్డులు జారీచేయనున్నట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఢిల్లీ, హర్యానాలోని ఫరిదాబాద్, గుర్గ్రామ్, మేవాట్, పల్వాల్లోని అభ్యర్థులకు సిపాయ్ డి ఫార్మా విభాగంలో ఈ ర్యాలీని నిర్వహిస్తుంది. అభ్యర్థులు మార్చి 13 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం. 55 శాతంతో 10+2 పరీక్ష ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అదేవిధంగా డి ఫార్మా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 19 నుండి 25 ఏళ్ల మధ్య వయస్సువారు అర్హులు. కలర్ పాస్పోర్టు సైజ్ ఫోటోగ్రాఫ్లతో 20 కాపీల సర్టిఫికెట్లను తీసుకురావాల్సిందిగా అధికారులు సూచించారు.