శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో మంగళవారం ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మేజర్లు మృతి చెందారు. పట్నిటాప్ ప్రాంతంలో శిక్షణలో ఉన్న సమయంలో సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ జిల్లాలోని శివ్ గర్ ధర్ ప్రాంతంలో కూలిపోయిందని జమ్మూకు చెందిన రక్షణ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఘటనలో ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారని, వారిని స్థానికులు వారిని ఆసుప్రతికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన ఉదయం 10.30 నుంచి 10.45 గంటల మధ్య జరిగినట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్కు చెందిందని చెప్పారు. ఘటనలో మేజర్ రోహిత్కుమార్, మేజర్ అనూజ్ రాజ్పుత్ విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేశారని సైన్యానికి చెందిన ఉత్తరకమాండ్ ట్వీట్ చేసింది.