నిజామాబాద్: జిల్లాలోని ఆర్మూర్ (Armoor) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చేపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను రాము, జ్ఞానేశ్వర్ గౌడ్గా గుర్తించారు.
ఘటనా స్థలంలోనే రాము మృతిచెందాడని, దవాఖానకు తరలిస్తుండగా జ్ఞానేశ్వర్ చనిపోయడని చెప్పారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం సమయంలో కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.