మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రంపై ఇతర ఇండస్ట్రీలకు చెందిన దర్శకులు కన్నేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలలో సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని భీమ్లా నాయక్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచాయి.
ఇప్పుడు ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కథ నచ్చిన జాన్ అబ్రహం ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను కొనుగోలు చేశాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇందులో జాన్ అబ్రహం-అభిషేక్ బచ్చన్ నటిస్తున్నట్లు మొదట వార్తలు వినిపించగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి అభిషేక్ బచ్చన్ తప్పుకున్నట్టు తెలుస్తుంది.
అభిషేక్ బచ్చన్ స్థానంలో అర్జున్ కపూర్ రానున్నట్టు తెలుస్తుంది. బిజూ మేనన్ పాత్రలో జాన్ అబ్రహం నటిస్తుండగా, పృథ్వీ రాజ్ పాత్రలో అర్జున్ కపూర్ కనిపించనున్నారు. జగన్శక్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్లో మొదలు కానుంది.