యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 4 నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు శుక్రవారం తెలిపారు.
భక్తుల విజ్ఞప్తి మేరకు ఆదివారం నుంచి ఆర్జిత సేవలు, నిత్య అన్నప్రసాద వితరణ పునః ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
ఆలయ ఉద్యోగులు, సిబ్బంది చాలామంది కరోనా బారినపడటంతో వారంరోజులుగా ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేశారు.
భక్తులను కేవలం లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడటంతో సేవలను తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి